పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 25వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మార్చి 10న ఏలూరు కార్పొరేషన్ లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ కు ముందు ఏలూరు కార్పొరేషన్ కు సంబంధించి ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని స్పష్టం చేసింది. అనంతరం ఈ అంశంపై మరోసారి విచారణ చేపట్టి ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ తాజాగా ఓట్ల లెక్కింపుపై ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ