ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 29, 30 తేదీలలో ఆయన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది.
శుక్రవారం ఉదయం విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్లి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అనంతపురం జిల్లాకు చేరుకుంటారు. అనంతరం జిల్లా అధికారులతో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తారు. ఆ తర్వాత సాయంత్రం కర్నూలు చేరుకుని, సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు కర్నూల్ జిల్లా అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరుపుతారు. ఇక శనివారం నాడు కడప జిల్లాకు చేరుకొని, ఆ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ