ఏపీలో రెండోవిడత పంచాయతీ ఎన్నికలు: 539 పంచాయితీలు ఏకగ్రీవం

539 Sarpanches were Unanimously Elected, Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Second Phase Panchayat Elections, Mango News, Panchayat polls, Second Phase Panchayat Elections, Second Phase Panchayat Elections In AP

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 3328 పంచాయతీలకు ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 8 తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులు, ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 539 పంచాయతీలు ఏకగ్రీవంగా అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70, అత్యల్పంగా పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లో 15 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 2786 పంచాయతీల్లో ఫిబ్రవరి 13 న పోలింగ్ నిర్వహించనున్నారు.

రెండోవిడతలో జిల్లాలవారీగా పంచాయతీల ఏకగ్రీవాల వివరాలు:

  1. కృష్ణా – 36
  2. గుంటూరు – 70
  3. ప్రకాశం – 69
  4. నెల్లూరు – 35
  5. తూర్పుగోదావరి – 17
  6. పశ్చిమగోదావరి – 15
  7. వైఎస్ఆర్ కడప – 40
  8. అనంతపురం – 15
  9. చిత్తూరు – 62
  10. కర్నూల్ – 57
  11. శ్రీకాకుళం – 41
  12. విశాఖపట్నం – 22
  13. విజయనగరం – 60
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =