రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 3328 పంచాయతీలకు ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 8 తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులు, ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 539 పంచాయతీలు ఏకగ్రీవంగా అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70, అత్యల్పంగా పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లో 15 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 2786 పంచాయతీల్లో ఫిబ్రవరి 13 న పోలింగ్ నిర్వహించనున్నారు.
రెండోవిడతలో జిల్లాలవారీగా పంచాయతీల ఏకగ్రీవాల వివరాలు:
- కృష్ణా – 36
- గుంటూరు – 70
- ప్రకాశం – 69
- నెల్లూరు – 35
- తూర్పుగోదావరి – 17
- పశ్చిమగోదావరి – 15
- వైఎస్ఆర్ కడప – 40
- అనంతపురం – 15
- చిత్తూరు – 62
- కర్నూల్ – 57
- శ్రీకాకుళం – 41
- విశాఖపట్నం – 22
- విజయనగరం – 60
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ