ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పీఆర్సీ సహా కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం

AP Employees Unions Calls For Strike From February 7 Regarding PRC Issue,AP employees threaten strike,AP Employees Unions Calls For Strike,AP Employees Unions Calls For Strike Regarding PRC Issue,Andhra Pradesh govt employees,Staff to wage a united fight against pay revision GOs ,Andhra govt employees strike over pay revision,Andhra Pradesh government ,AP Cabinet approves PRC Jeevol-Employees on strike,PRC Issue,PRC Issue in Ap,mango News

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులకు జగనన్న టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేట్ తో ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయింపుతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుకు నగదు చెల్లింపుకు నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన అంశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని నిర్ణయం. కరోనా దృష్ట్యా కాంట్రాక్ట్‌ పద్ధతిలో వైద్యుల నియామకానికి ఆమోదం. గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాల్లో ఓటీఎస్‌ చెల్లింపునకు ఆమోదం. అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం. ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని నిర్ణయం. కిడాంబి శ్రీకాంత్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు. ఈబీసీ నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం. 16 వైద్య కళాశాలల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం. రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయింపు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుకు చెల్లింపు నిర్ణయం. కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం. విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూ కేటాయింపుకు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులకు కమిటీ

పీఆర్సీ విషయమై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను బుజ్జగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ సమీర్ శర్మలను కమిటీలో సభ్యులుగా చేర్చారు. ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులు వివరించి, అపోహలు తొలగించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 4 =