ఆంధప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని సోమవారం నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధం కాకపోవడంతో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది. గతంలో ఫిబ్రవరి 5న మొదటి దశ, 9న రెండో దశ, 13న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీ షెడ్యూల్ నిర్ణయించింది. తాజాగా ఫిబ్రవరి 5 న జరగాల్సిన మొదటి దశ ఎన్నికలు చివరి దశలో జరగనున్నట్టు ప్రకటించింది.
దీంతో ఫిబ్రవరి 9 న జరగాల్సిన రెండో దశను మొదటిదశగా, 13న జరగాల్సిన మూడో దశను రెండో దశగా, 17న జరగాల్సిన నాలుగో దశ మూడో దశగా మార్చినట్టు పేర్కొన్నారు. ఇక ఇక ఫిబ్రవరి 5 న జరగాల్సిన మొదటి దశ ఎన్నికలను ఫిబ్రవరి 21 న నాలుగో దశగా నిర్వహించనున్నారు. రీషెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9న జరిగే మొదటి దశకు జనవరి 29 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ