రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ల ఆద్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సోమవారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పీఆర్సీ నివేదికతో పాటు, వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుటకు నిర్ణయం, తదితర అంశాలపై చర్చించారు. వేతన సవరణ నివేదికతో పాటు ఉద్యోగులకు సంబంధించిన కాలానుగుణ పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పొడిగింపు, ట్రామా ఫ్రీ సర్వీసెస్ తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. దీనికి సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశాల షెడ్యూల్ ను కూడా రూపొందించడం జరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ