దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 2వ తేదీన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రానున్నారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు మద్దతు తెలపడంతో వారితో వేర్వేరుగా భేటీ కానున్నారు. జూలై 2, శనివారం ఉదయం 11.30 గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లోని బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం ముందుగా ఖైరతాబాద్లోని జలవిహార్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం టీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మజ్లీస్ ప్రజాప్రతినిధులతో కూడా యశ్వంత్ సిన్హా విడిగా భేటీ కానున్నారు.
మరోవైపు ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హా సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, మద్ధతుగా సభ నిర్వహణపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైదరాబాద్ లో పలువురు మంత్రులు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలుకనున్నామని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ నాయకులకు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. యశ్వంత్ సిన్హా తరపున రాష్ట్రపతి ఎన్నికల ప్రచార కమిటీలో సభ్యుడిగా ఉన్న చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY