ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 526 జెడ్పీటీసీ స్థానాలకు, 7231 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు గురువారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా గత సంవత్సరంలో మార్చి 14న నిలిచిన ఈ ఎన్నికల ప్రక్రియను మళ్ళీ అక్కడినుంచే కొనసాగించే విధంగా ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ వరకు గతంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే మళ్ళీ ఎన్నికల పక్రియ ప్రారంభం కానుంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏప్రిల్ 8 వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎక్కడైనా అవసరమైతే ఏప్రిల్ 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ