2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. స్వల్ప చర్చ అనంతరం వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈరోజు అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు.
మండలిలో మాత్రం బడ్జెట్ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి సిదిరి అప్పుల రాజు ప్రవేశపెడతారు. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాము. వీటితోపాటు నవరత్నాల పథకాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు జరిపాం. సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించాం అని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ