ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ) ఫలితాలను ఫిబ్రవరి 18, మంగళవారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఏపీపీ ఫలితాల విడుదల కార్యక్రమంలో హోం మంత్రితో పాటుగా డీజీపీ గౌతమ్ సవాంగ్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటకరీ కిశోర్ కుమార్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ అమిత్ గార్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ ఏపీపీ పోస్టులకు మొత్తం 2,500 మంది దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టులకు 50 మంది ఎంపికయినట్టు తెలిపారు. 2013 తర్వాత మళ్లీ ఈ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టడడం ఇప్పుడేనని తెలిపారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నియామకాలను పూర్తి చేసిందని, ఎంపికయిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఏపీపీ ఫలితాలు ఉంచామని చెప్పారు.
[subscribe]