ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశాంతి, త్రిల్లేశ్వర్, ముకుంద్ రెడ్డి, రజినీకాంత్ రెడ్డి లను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నళిని పద్మావతిని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా నియమించారు. అలాగే వేణుగోపాల్ రెడ్డిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా నియమించారు.
బదిలీ అయిన మున్సిపల్ కమిషనర్ల వివరాలు:
- కల్వకుర్తి మున్సిపాలిటీ – ఎండీ జకీర్ అహ్మద్
- బెల్లంపల్లి మున్సిపాలిటీ – ఆకుల వెంకటేశ్
- లక్సెట్టిపేట మున్సిపాలిటీ – ఆర్. త్రయంబకేశ్వర్రావు
- నాగర్కర్నూల్ మున్సిపాలిటీ – గోన అన్వేష్
- జగిత్యాల మున్సిపాలిటీ – కే. జయంత్ కుమార్ రెడ్డి
- నిర్మల్ మున్సిపాలిటీ- నల్లమల్ల బాలకృష్ణ
- అమీన్పూర్ మున్సిపాలిటీ – సుజాత
- ఆలియా మున్సిపాలిటీ – పి. వేమన రెడ్డి
- తెల్లాపూర్ మున్సిపాలిటీ – వెంకట మణికరణ్
- షాద్నగర్ మున్సిపాలిటీ – లావణ్య
- సంగారెడ్డి మున్సిపాలిటీ – బి.శరత్ చంద్ర
- తాండూరు మున్సిపాలిటీ – కే. శ్రీనివాస్ రెడ్డి
- శంషాబాద్ మున్సిపాలిటీ – ఎండీ షబ్బీర్ అలీ
- నర్సంపేట మున్సిపాలిటీ – ఎస్. విద్యాధర్
- పరకాల మున్సిపాలిటీ – బి. యాదగిరి
- పెద్దపల్లి మున్సిపాలిటీ – చాడల తిరుపతి
- వేములవాడ మున్సిపాలిటీ – మట్ట శ్రీనివాస్ రెడ్డి
- సత్తుపల్లి మున్సిపాలిటీ – కే. సుజాత
- ఇల్లందు మున్సిపాలిటీ – వీరేందర్
- మందమర్రి మున్సిపాలిటీ – గద్దె రాజు
- వనపర్తి మున్సిపాలిటీ – మహేశ్వర్ రెడ్డి
- సదాశివపేట మున్సిపాలిటీ – స్పందన
- ఎల్లారెడ్డి మున్సిపాలిటీ – ఖమర్ అహ్మద్
- హుజుర్నగర్ మున్సిపాలిటీ – బట్టు నాగిరెడ్డి
- కామారెడ్డి మున్సిపాలిటీ – బి.గంగాధర్
- యాదగిరిగుట్ట మున్సిపాలిటీ – జంపాలా రజిత
- నందికొండ మున్సిపాలిటీ – పల్లా రావు
- చిట్యాల్ మున్సిపాలిటీ – ప్రభాకర్
- ఆమన్గల్ మున్సిపాలిటీ – శ్యామ్సుందర్
[subscribe]