నేడే మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ, వారాహిలో సభా ప్రాంగణానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్

JanaSena Party Celebrates 10th Foundation Day Pawan Kalyan To Hold Meeting,Janasena Party 10th Formation Day,Pawan Kalyan To Hold Meeting,JanaSena Party 10th Foundation Day,Mango News,Janasena Formation Day at Machilipatnam,Pawan Kalyan to Reach Venue,Pawan Kalyan on Varahi Vehicle,Janasena Chief Pawan Kalyan,AP Politics,AP Latest Political News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Janasena Formation Day Latest Updates,Janasena Party BC Round Table Meeting,Jana Sena Foundation Day Celebration

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఈరోజు (మార్చి 14, మంగళవారం) సాయంత్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జరగనుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వారాహి వాహనంలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. 2 గంటలకు ఆటోనగర్ గేట్ దగ్గర పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు స్వాగతం పలుకనుండగా, తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు, గుడివాడ సెంటర్ (బైపాస్ దగ్గర) మీదుగా సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఈ సభకు ఏపీలోని పలు జిల్లాల నుంచి మరియు తెలంగాణ నుంచి కూడా జనసైనికులు, వీర మహిళలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.

మరోవైపు జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కనీవినీ ఎరుగని రీతిలో సభ స్థలి ముస్తాబు అయ్యిందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యిందని, సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేసినట్టు తెలిపారు. సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా స్థలం కేటాయించడం జరిగిందని, తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. సోమవారం సాయంత్రం సభా ప్రాంగణాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మొత్తం ఏర్పాట్లు గురించి కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించారు.

సభా వేదిక పరిశీలన అనంతరం అక్కడే ఉన్న ఆవిర్భావ సభ వాలంటీర్లతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభకు వాలంటీర్ల సేవలు చాలా కీలకం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాలంటీర్లు పనిచేయాలి. నిబంధనల ప్రకారం పక్కాగా వ్యవహరించండి. సభకు వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించి, వారిని ప్రత్యేకంగా చూసుకోవడం వాలంటీర్ల బాధ్యత. పార్టీ ప్రతిష్ట పెంచేలా వాలంటీర్లు సేవలు ఉండాలి. పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకొని పని చేయండి. కార్యక్రమాల నిర్వహణ కమిటీ సూచనలు తీసుకోండి. పోలీసు శాఖకు సహకరించి, సభ సజావుగా సాగేలా చూడాలి” అని పేర్కొన్నారు.

ప్రత్యేక గీతం విడుదల:

గబ్బర్ సింగ్ టీం ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన గీతాన్ని నాదెండ్ల మనోహర్ సోమవారం సభా వేదిక వద్ద విడుదల చేశారు. భగభగ మండే భగత్ సింగ్ అంటూ వచ్చే గీతం అందరిలో స్ఫూర్తి నింపేలా ఉంటుందని ఈ సందర్భంగా మనోహర్ గబ్బర్ సింగ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభా వేదిక వద్ద నాదెండ్ల మనోహర్ సమక్షంలో మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీలో చేరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =