ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖరారు చేసింది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నగరూరు రాఘవేంద్ర పోటీ చేయనున్నట్టుగా బీజేపీ ప్రకటించింది.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరపున ఏ.వెంకట నారాయణ రెడ్డి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE