దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, రాజసభ సభ్యుడు సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నానని” సీఎం రమేష్ ట్వీట్ చేశారు.
I have tested positive for #COVID__19. Whilst I am doing fine, I am being under isolation on the recommendation of doctors.
— CM Ramesh (@CMRamesh_MP) August 7, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu