తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఇరుపార్టీల కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. రత్నప్రభ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ ఎంపీలు జివీఎల్ నర్సింహారావు, సీఎం రమేష్, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేయడం పూర్తవడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా పలువురు నాయకులు తమ పార్టీ అభ్యర్థుల తరపున తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ