ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి పయనమవనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాలలో భాగంగా కేంద్రం ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తోంది. దీనిలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును కోరిన కేంద్రం, ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపింది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే నేషనల్ కమిటీ మీటింగ్కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడం కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఒక సంవత్సరం పాటు, అనగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY