నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దివంగత నటుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూశారు. జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే తీవ్ర మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఆమె తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయమే ఆమె ఇంట్లో ఉరి వేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఆమె నివాసానికి చేరుకున్నారు. ఇక ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె విదేశాల్లో ఉంటుండగా, ఇటీవలే ఆమె చిన్న కూతురి వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆమె మృతి సమాచారాన్ని కుమార్తెలతో పాటు విదేశాల్లో ఉంటున్న ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా ఉమా మహేశ్వరి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY