సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను కదనరంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 8న మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమావేశమై.. స్థానాలు, అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అటు వైసీపీ ఇప్పటికే 60కి పైగా అసెంబ్లీ.. 10కి పైగా లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈక్రమంలో వైసీపీ నేతలను ఢీ కొట్టేందుకు బలమైన నేతలను రంగంలోకి దించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కసరత్తు చేస్తున్నారు.
అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు స్థానాలకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అటు వైసీపీ దాదాపు నెల్లూరు జిల్లాలోని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈక్రమంలో వారిని మించిన అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేశారట. నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలోకి దించుతున్నారు. నరసరావుపేట నుంచి ఆయన్ను పోటీ చేయిస్తున్నారు. ఈక్రమంలో నియోజకవర్గాన్ని ఎండీ ఖలీల్కు కేటాయించారు. అయితే ఖలీల్కు పోటీగా చంద్రబాబు మాజీ మంత్రి నారాయణను బరిలోకి దించాలని నిర్ణయించారట.
అలాగే నెల్లూరు రూరల్ నుంచి ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ బరిలోకి దించుతోంది. అయితే కొద్దిరోజుల క్రితం వైసీపీ హైకమాండ్తో చెడడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తెలుగు దేశం పార్టీలో చేరారు. ఈక్రమంలో నెల్లూరు రూరల్ నుంచి అదాల ప్రభాకర్ రెడ్డికి పోటీగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వెంకటగిరి నుంచి వైసీపీ తరుపున నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి బరిలోకి దిగుతుండగా.. ఆయనకు పోటీగా చంద్రబాబు కురుగుండ్ల రామకృష్ణను పోటీ చేయిస్తున్నారట.
అయితే ప్రస్తుతం వెంకటగిరికి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరారు. ఈక్రమంలో తనకు వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి టికెట్ కేటాయించాలని ఆనం పట్టుపడుతున్నారట. కానీ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకత పెరిగిపోవడంతో.. ఈసారి ఆత్మకూర్ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారట. గతంలో ఓసారి కాంగ్రెస్ తరుపున ఆత్మకూర్ నుంచి పోటీ చేసి ఆనం గెలుపొందారు. అందుకే ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని చంద్రబాబు కోరుతున్నారట.
ప్రస్తుతం గూడురు ఎమ్మెల్యేగా వైసీపీ నేత వెలగపల్లి వరప్రసాద్ రావు ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ హైకమాండ్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ నాగార్జునను బరిలోకి దించుతోంది. ఈక్రమంలో నాగార్జునకు పోటీ చంద్రబాబు పాశం సునీల్ కుమార్ను బరిలోకి దించాలని ఆలోచిస్తున్నారట. ఇలా వైసీపీ అభ్యర్థులను ఢీ కొట్టేందుకు చంద్రబాబు క్యాండిడేట్లను ఎంపిక చేశారట. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE