ఏపీ సీఎం జగన్‌తో సురేశ్‌ ప్రభు భేటీ

AP Breaking News, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Ex-Central Minister Suresh Prabhu, Mango News Telugu, Suresh Prabhu Meets AP CM YS Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిసెంబర్ 27, శుక్రవారం నాడు కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ప్రభు కలిశారు. విజయవాడకు వచ్చిన సురేశ్‌ ప్రభు దంపతులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలుసుకున్నారు. మధ్యాహ్నాం సీఎం వైఎస్ జగన్ దంపతులతో కలిసి సురేశ్ ప్రభు దంపతులు లంచ్ కూడా చేశారు. అనంతరం వీరిద్దరి మధ్య దాదాపు గంట సేపు జరిగిన భేటీలో రాష్ట్ర పరిస్థితులు, రాజకీయాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై తో పాటు పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సురేష్‌ ప్రభుతో భేటీ కావడం కోసమే శుక్రవారం ఉదయం నిర్వహించిన కేబినెట్‌ సమావేశాన్ని సీఎం వైఎస్ జగన్‌ త్వరగా ముగించినట్టుగా సమాచారం. సురేశ్‌ ప్రభు ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =