ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే విద్యుత్ ఛార్జీల పెంపు అమల్లోకి రానుంది. 500 యూనిట్లు కంటే ఎక్కువ వాడుకునే వినియోగదారులకు ఒక యూనిట్కు 90పైసలు చొప్పున చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించారు. 500 యూనిట్లు పైబడిన వారికి గతంలో యూనిట్ ఛార్జ్ రూ.9.05 పైసలుగా ఉండగా, ప్రస్తుతం రూ.9.95 పైసలుగా టారిఫ్ ను నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ, కార్పోరేట్ సంస్థలపై భారం పడే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని 1.30 లక్షల గృహ వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపు భారం పడనుంది.
[subscribe]