టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసారంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. అలాగే ఈ మీడియా సమావేశం సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తానని, అంతవరకూ వెళ్ళేది లేదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో చెప్పాలనుకుంటున్నప్పటికీ, స్పీకర్ మైక్ ఇవ్వలేదని అన్నారు. తనకు పదవులు, రికార్డులు అవసరం లేదన్నారు. తాను చేస్తున్న ధర్మ పోరాటానికి ప్రజలంతా సహకరించాలని, సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించి, కృషి చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ