ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌

Andhra Pradesh Heavy rains, Andhra Pradesh Rains, AP Heavy Rains, CM YS Jagan, Heavy Rains, Heavy Rains In Andhra Pradesh, Heavy Rains In AP, Mango News, Modi Speaks to AP CM YS Jagan About Heavy Rainfall, PM Modi speaks to Andhra CM over flood situation, PM Modi Speaks to AP CM YS Jagan, PM Modi Speaks to AP CM YS Jagan About Heavy Rainfall in parts of the State, PM Narendra Modi speaks to Andhra Pradesh CM YS Jagan, PM speaks to Andhra Pradesh CM, YS Jagan reviews amid heavy rain forecast

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను. ఈ సమయంలో అందరూ సురక్షితంగా, భద్రంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు శనివారం రాష్ట్రంలోని కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. ముందుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితులను సమీక్షించనున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =