ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ హాస్య నటుడు అలీకి కీలక పదవి ఇచ్చారు. ఆయనను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అలీ వచ్చే రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరిన అలీ అప్పటినుంచి పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో దీనికి ప్రతిఫలంగా ఆయనకు ఈ పదవి లభించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే గత కొన్ని నెలలుగా అలీకి ఎదో ఒక పదవి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఒకదశలో ఆయనకు రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ సీటు, లేదా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారని వార్తలొచ్చాయి. కానీ వాటిని వేరే వారికి కేటాయించారు. ఆ సమయంలో అలీ సీఎం జగన్ ను కలవగా, త్వరలోనే ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇస్తానని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. అప్పుడు ఇచ్చిన మాట మేరకు తాజాగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని ఇచ్చారని భావిస్తున్నారు. అయితే తాను పదవుల కోసం వైసీపీలో చేరలేదని, జగన్ మనసులో స్థానమే తనకు ముఖ్యమని అప్పట్లో ఆలీ పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ మైనార్టీల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఆయన అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY