జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని అక్టోబర్ 30వ తేదీన నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని నిర్వహించే ఈ పీఏసీ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన దమన నీతి, అక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నామని, అలాగే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటుగా పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారని జనసేన పార్టీ ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE