ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్ సమీక్ష

AP CM YS Jagan Conducts Review Over English Medium Implementation In Govt Schools, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, CM Jagan Conducts Review Over English Medium Implementation, CM Jagan Conducts Review Over English Medium Implementation In Govt Schools, English Medium Implementation In Govt Schools, Jagan Conducts Review Over English Medium Implementation In Govt Schools, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 9, శనివారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే నాడు–నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను దశలవారీగా మార్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ‘నాడు- నేడు’లో భాగంగా పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర విద్యాశాఖ అధికారులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేసారు. ఇక పై పాఠశాలల్లో ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొదటి దశలో భాగంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంలోనే లో బోధించాలని సీఎం నిర్ణయించారు. అదేవిధంగా సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహా విధానాలను ప్రభుత్వ పాఠశాలల్లో పాటించాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + one =