మనిషి తలరాత మార్చే శక్తి చదువుకు ఉందని, నాణ్యమైన చదువు అందించడం ద్వారా సమాజంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములవుదామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మ ఒడి మూడవ విడత నిధులను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పథకం ఏర్పాటు చేయడానికి గల కారణాలను వివరించారు. సీఎం జగన్ ప్రసంగం లోని కొన్ని కీలక విషయాలు..
- ఆర్ధిక సమస్యల కారణంగా పిల్లల చదువులు ఆగిపోకూడదనే సదుద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశాం, పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు బాగుపడతాయి.
- అందుకే రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు ఈ పథకం ద్వారా ఆర్ధిక సహాయం చేస్తున్నాం.
- ఈరోజు రూ. 6, 595 కోట్ల రూపాయల నిధులను నేరుగా తల్లుల ఖాతాలోకి జమ చేస్తున్నాం.
- దీని ద్వారా దాదాపు 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది.
- వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.
- ఒకప్పుడు ప్రయివేట్ స్కూళ్ళలో మాత్రమే ఉండే ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నాం.
- పిల్లలు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళితేనే చదువు బాగా వస్తుంది, వాళ్ల భవిష్యత్తు దృష్ట్యానే 75 శాతం హాజరు అనే నిబంధన తీసుకొచ్చాం.
- తమ పిల్లలను ఈ దిశగా ప్రోత్సహించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY