ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాది మూడో విడత ఇన్పుట్ సబ్సిడీ నగదును సీఎం జగన్ బటన్ నొక్కి రైతులకు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల ఇతర కారణాలతో పంటలు నష్టపోయిన పలువురు రైతులకు కూడా నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇక నగదు పంపిణీ కార్యక్రమం చేయడానికి ముందుగా అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగో ఏడాది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నగదును అందిస్తున్నామని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేశామని తెలిపారు. ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకం కింద నేడు మూడో విడతలో భాగంగా మొత్తం 51.12 లక్షల మంది రైతులకు రూ. 1,090.76 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నగదును అందిస్తున్నామని ప్రకటించారు. ప్రతి ఏటా రూ. 13,500 చొప్పున రైతులకు అందిస్తున్నామని, తద్వారా ఐదేళ్లల్లో మొత్తం రూ. రూ. 67,500 నగదు సాయం చేస్తున్నామని తెలిపారు. అందరికీ అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ. 27,062 కోట్లు రైతులకు పంపిణీ చేశామని సీఎం జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE