ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం అనంతపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శింగనమల నియోజకవర్గం లోని నార్పల మండల కేంద్రంలో ఆయన నేడు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం బటన్ నొక్కడం ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులను కలుసుకుని మాట్లాడనున్నారు. ఇక సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గౌతమి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన ఆసాంతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లపై కీలక సూచనలు ఇచ్చారు. వేసవి కావడం, పైగా బహిరంగ సభ జరుగనున్న క్రమంలో.. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల కోసం వాటర్ పాకెట్స్, మజ్జిగ, స్నాక్స్ వంటివి అందించాల్సిందిగా ఆదేశించారు.
కాగా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు ఇప్పటికే ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు బోర్డింగ్ మరియు లాడ్జింగ్ ఖర్చులను కూడా అందిస్తుంది. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థులకు రూ.20,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, ఐటీఐ విద్యార్థులకు రూ.10,000 చొప్పున రెండు విడతలుగా అందజేస్తోంది. అయితే 2017 నుండి టిడి ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ.1,778 కోట్ల బకాయిలతో సహా ‘జగనన్న విద్యా దీవెన’ మరియు ‘జగనన్న వసతి దీవెన’ పథకాలకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.13,311 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE