రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్.. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం నిధులు విడుదల, షెడ్యూల్ ఇదే

CM Jagan To Release Fourth Installment of Jagananna Vidya Deevena Scheme Funds For Students at NTR District Tomorrow,CM Jagan To Release Fourth Installment,Jagananna Vidya Deevena Scheme,Funds For Students at NTR District Tomorrow,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Jagananna Vidya Deevena Latest News,Jagananna Vidya Deevena Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదివారం (మార్చి 19, 2023) ఎన్టీఆర్‌ జిల్లాలో పర్య‌టించ‌నున్నారు. పర్యటనలో భాగంగా ఆయన రేపు తిరువూరులో ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా వాస్తవానికి శనివారమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కావాల్సి ఉంది. అయితే తిరువూరులో సీఎం జగన్ పాల్గొననున్న సభా వేదిక పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటంతో కార్యక్రమాన్ని అదివారానికి వాయిదా వేశారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులకు రూ.700 కోట్లు అందించనున్నట్లు అధికారులు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం.. సీఎం జగన్ ఆదివారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరు చేరుకుంటారు. ఈ క్రమంలో ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అదే వేదికపై నుంచి జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. ఇక కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 15 =