తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, పలువురు టీడీపీ నేతలు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పసల కనక సుందరరావు, ఇతర టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE