ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే వ్యూహ ప్రతి వ్యూహాలతో ఏపీ రాజకీయ పార్టీలు ముందుకు వెళుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న టీడీపీ రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యేగా కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంపై టీడీపీ ఫోకస్ పెట్టింది. కొడాలి నానీని ఓడించడమే లక్ష్యంగా గుడివాడపై పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని ఢీ కొట్టగలిగిన నేత కోసం చాలాకాలంగా అన్వేషిస్తోంది.
గుడివాడ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన తారకరత్న వచ్చే ఎన్నికల్లో కొడాలి నానీతో తలపడాలని భావించారు.కానీ నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో.. ఆయన భార్య అలేఖ్య రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. గుడివాడ ఎన్నికల బరిలో అలేఖ్య రెడ్డి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీకి కంచుకోట లాంటి గుడివాడ నియోజకవర్గంలో పునర్వైభవం సంతరించుకోవడం కోసం టీడీపీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో గుడివాడలో విజయం సాధించడం కోసం టీడీపీ అభ్యర్థిగా యువ హీరో నారా రోహిత్ పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న కొడాలి నానికి చెక్ పెట్టడానికి తమ ఫ్యామిలీ నుంచి చరిష్మా ఉన్న ఒక నాయకుడిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తుండటంతో.. నారా రోహిత్ పేరు ఇప్పుడు గుడివాడ బరిలో వినిపిస్తోంది. ఇప్పటికే నారా రోహిత్ సరైన సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటన చేశారు. టీడీపీ కూడా గుడివాడ నుంచి రోహిత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే నారా రోహిత్ ఎంట్రీపై టీడీపీ అధిష్టానమే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE