ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ ల బదిలీ చోటుచేసుకోగా, ఆరుగురికి పోస్టింగ్ ఇచ్చి, ఇద్దరిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలనీ సూచించారు. ఈ మేరకు బుధవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ ల వివరాలు:
- శ్రీకాకుళం ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీగా వీఎన్ మణికంఠ చందోలు నియామకం
- ఇప్పటివరకు శ్రీకాకుళం ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీగా ఉన్న పి.సోమశేఖర్ రావుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలనీ ఆదేశాలు
- కర్నూల్ ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్
- వైఎస్ఆర్ కడప జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) గా తుషార్ డూడి
- వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరు అసిస్టెంట్ ఎస్పీగా ప్రేరణ కుమార్,
- వై.ప్రసాద్ రావు (ప్రోబ్. డిఆర్ డీఎస్పీ) పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలనీ ఆదేశాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు అసిస్టెంట్ ఎస్పీగా కేవీ మహేశ్వర రెడ్డి
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా ప్రతాప్ శివకిశోర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY