ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఆగస్టు 4 నుంచి పార్టీ కార్యకర్తలతో నేరుగా మమేకమవుతానని నేతలకు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నేతలకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో సీఎం జగన్ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు.
- ఆగష్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గంలోని 50 మంది ముఖ్య కార్యకర్తలతో భేటీకి హామీ.
- సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి ప్రతి నెలా అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.
- క్షేత్రస్థాయిలో ప్రతినెలా కచ్చితంగా ఆరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
- ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం 10 రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలి.
- ప్రతి సచివాలయం పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు కేటాయిస్తున్నాం.
- ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు సరిగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
- బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్లోగా నియమించాలి.
- వీటితో పాటు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలి.
- అలాగే పార్టీ బూత్ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలి.
- ప్రతి కార్యకర్తా అంకితభావంతో పనిచేస్తే మన పార్టీ రాష్ట్రంలో 175కి 175 స్థానాల్లో విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ