జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ వారి పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరి రాజన్ ద్వారా శుక్రవారం ప్రగతి భవన్ కు ఆహ్వాన లేఖను పంపించారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి జూలై 28 నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.
ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ గిరి రాజన్, సీఎం కేసీఆర్ కు శాలువా కప్పి, జ్జాపికను అందచేసి ఆహ్వానపత్రికను అందించారు. కాగా 188 దేశాలనుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు భారతదేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక పోటీలని ఆహ్వాన లేఖలో సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY