తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 739 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 22, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,13,120 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 377 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,686 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మరో 662 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,04,323 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శుక్రవారం నాడు 32,808 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (739):
- హైదరాబాద్ – 377
- రంగారెడ్డి – 60
- మేడ్చల్ మల్కాజిగిరి – 53
- మంచిర్యాల – 26
- ఖమ్మం – 24
- పెద్దపల్లి – 24
- నల్గొండ – 20
- హనుమకొండ – 16
- కరీంనగర్ – 12
- జగిత్యాల – 12
- మహబూబాబాద్ – 10
- వికారాబాద్ – 9
- రాజన్న సిరిసిల్ల – 9
- సిద్దిపేట – 9
- నిజామాబాద్ – 9
- భద్రాద్రి కొత్తగూడెం – 8
- మహబూబ్ నగర్ – 8
- సంగారెడ్డి – 8
- యాదాద్రి భువనగిరి – 7
- మెదక్ – 7
- సూర్యాపేట – 6
- వనపర్తి – 5
- నారాయణ్ పేట్ – 4
- నిర్మల్ – 4
- నాగర్ కర్నూల్ – 4
- ఆదిలాబాద్ – 3
- జనగామ – 2
- వరంగల్ రూరల్ – 1
- కామారెడ్డి – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 1
- జోగులాంబ గద్వాల్ – 0
- ములుగు – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY