ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆసుపత్రులకు సంబంధించి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వాటిని 3 సంవత్సరాలలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని, నిర్మాణ విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని సూచించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మాణాలు ఉండాలని పేర్కొన్నారు. మరోవైపు విశాఖపట్నం జిల్లా పాడేరులో అక్టోబర్ 2 వ తేదీన వైద్య కళాశాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu