ఏపీ విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రాజశేఖర్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు డిజిటల్ విద్యను అందించడానికై వివిధ కంపెనీల డిస్ప్లేల పరికరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక సూచనలు..
- నాడు-నేడు రెండోదశ పనులను వేగవంతం చేయాలి. దీనిపై జిల్లా స్దాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలి.
- స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- విద్యా వ్యవస్థలో అమలవుతున్న పలు కార్యక్రమాల డేటా ఎప్పటికప్పుడు అప్లోడ్ అయ్యేలా చూడాలి.
- టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలి.
- తరగతి గదుల్లో పెట్టే ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ టీవీలు నాణ్యతతో ఉండాలి.
- పీపీ-1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలి.
- ఈ సదుపాయాలను అన్ని హైస్కూళ్లలో మరియు నాడు-నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో మొదటి దశ కింద ఏర్పాటు చేయాలి.
- సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్ల నాణ్యతపై దృష్టి సారించాలి.
- రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో డీఈఓ, ఎంఈఓ సహా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలి.
- అలాగే ఎస్సీఈఆర్టీ, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ