68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ నుండి నాట్యం, కలర్ ఫోటో చిత్రాలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“68వ జాతీయస్థాయి చలన చిత్ర పురస్కార విజేతలకు హృదయపూర్వక అభినందనలు. ఈ దఫా పురస్కారాల్లో ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం సంతోషించదగ్గ పరిణామం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్.తమన్ (అల వైకుంఠపురంలో), ఉత్తమ కొరియోగ్రఫీ సంధ్యా రాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో పురస్కారాలు కైవశం చేసుకొన్నందుకు ఆనందంగా ఉంది. వీరందరికీ నా అభినందనలు. ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY