ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కే వి ఉషశ్రీ చరణ్, ఉన్నతాధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. అంగన్వాడీలలో నాడు–నేడుపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అంగన్వాడీలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలనన్నారు. పాలు, గుడ్లు లాంటి పౌష్టికాహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని, సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్నారు.
అంగన్వాడీలలో నాడు-నేడు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చుచేస్తోందని, మూడు విడతల్లో పనులు చేపట్టి, మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడేలా చేయాలన్నారు. అలాగే అంగన్వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇక అంగన్వాడీలలో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా పరిశీలన చేయించాలని, వైద్యపరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతులపై సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం అనుమతి ఇచ్చి, వీలైనంత త్వరగా భర్తీచేయాలని ఆదేశించారు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టిందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE