47వ జాతీయ కార్మిక సదస్సుకి తిరుపతి వేదిక కావడం ఏపీకి గర్వకారణం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం సదస్సు చివరి రోజున వర్చువల్గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి జాతీయ కార్మిక సదస్సులో ముగింపు సందేశం ఇచ్చారు. గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలకు మొత్తం 19 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే రాష్ట్రం తరపున చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మతో పాటు పలువురు సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
ఇక ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన కోసం అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సదస్సు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ సదస్సుకి వేదికగా తిరుపతిని ఎంపిక చేసినందుకు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్కి ప్రత్యేక కృతజ్ఞతలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం తెలిపారు. గత రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించబడిన ముఖ్యమైన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అలాగే మీ అందరికీ ఆ వేంకటేశ్వరుని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY