ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులకి మరికొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- విద్యుత్ డిమాండ్ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి.
- ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- అలాగే పలు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై సరిగా జరిగేలా చూసుకోవాలి.
- రాష్ట్రంలో వ్యవసాయ మెటార్లకు మీటర్లు బిగించడం వలన రైతులకు ఎంతో మేలు కలుగనుంది.
- దీనివలన రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదు. వినియోగించిన మేర బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయిన తీరుని రైతులకు లేఖల ద్వారా వివరించాలి.
- దీని ద్వారా 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు తెలియజేయాలి.
- నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు ఎక్కడ ట్రాన్సాఫార్మర్స్ పాడైనా స్పందించి వెంటనే రీప్లేస్ చేయాలి.
- కొత్త వ్యవసాయ పంపుసెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి.
- థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలి. దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ