వ్యవసాయ మెటార్లకు మీటర్లు వలన రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదు – విద్యుత్‌ శాఖపై సమీక్షలో సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy Held Review on Electricity Department in Camp Office at Tadepalli Today, AP CM YS Jagan Mohan Reddy Held Review on Electricity Department in Camp Office at Tadepalli Today, AP CM YS Jagan Held Review on Electricity Department in Camp Office at Tadepalli Today, Review on Electricity Department in Camp Office at Tadepalli, Review on Electricity Department, AP Electricity Department, Electricity Department, Tadepalli Camp Office, AP Electricity Department Review, AP Electricity Department News, AP Electricity Department Latest News, AP Electricity Department Latest Updates, AP Electricity Department Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులకి మరికొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి.
  • ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి.
  • అలాగే పలు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై సరిగా జరిగేలా చూసుకోవాలి.
  • రాష్ట్రంలో వ్యవసాయ మెటార్లకు మీటర్లు బిగించడం వలన రైతులకు ఎంతో మేలు కలుగనుంది.
  • దీనివలన రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదు. వినియోగించిన మేర బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  • శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం అయిన తీరుని రైతులకు లేఖల ద్వారా వివరించాలి.
  • దీని ద్వారా 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు తెలియజేయాలి.
  • నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పాటు ఎక్కడ ట్రాన్సాఫార్మర్స్ పాడైనా స్పందించి వెంటనే రీప్లేస్‌ చేయాలి.
  • కొత్త వ్యవసాయ పంపుసెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి.
  • థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలి. దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 15 =