ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి (నవంబర్ 11) నేడు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్ర సమరయోధుల్లో ముఖ్యుడిగానే గానే కాకుండా, ప్రఖ్యాత పండితుడు, కవిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుగాంచారు. మొత్తం 11 సంవత్సరాల పాటుగా ఆయన దేశ విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ