ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (జూలై 20, బుధవారం) పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని మొండివారిపాలెం వద్ద రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. రామాయపట్నం పోర్టుకు సంబంధించి భూసేకరణ పనులు దాదాపు పూర్తవడంతో పోర్టు శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి,హెలిప్యాడ్, బహిరంగ సభ, భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు ఇచ్చారు.
ముందుగా బుధవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. 10.40 గంటలకు రామాయపట్నం పోర్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకోనున్నారు. 11-12.30 గంటల మధ్య రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంట తరువాత తిరుగు ప్రయాణమై తాడేపల్లికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY