ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటనకు బయలు దేరనున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా ప్యారిస్కు వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి అక్కడి నుంచి ప్యారిస్కు వెళ్లనున్నారు. 29వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి దంపతులు ప్యారిస్ చేరుకోనున్నారు. కాగా సీఎం దంపతుల పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్యారిస్లో ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ కళాశాలలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.ఈ క్రమంలో జూలై 2వ తేదీన ఇన్సీడ్ కళాశాలలో స్నాతకోత్సవం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే సీఎం జగన్ దంపతులు ప్యారిస్కు పయనమవుతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం వారు జూలై 3న తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. ఇక హర్షా రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ను బెంగళూరులో పూర్తి చేసిన అనంతరం గ్రాడ్యుయేషన్ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చేరారు. ఆ తర్వాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదవడం కోసం హర్షా రెడ్డి 2020 ఆగష్టులో పారిస్ వెళ్లారు. అయితే పర్యటనకు ముందుగా సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరగా నాంపల్లి లోని సిబిఐ కోర్ట్ అందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్యారిస్ పర్యటనకు వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ