ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిజిటల్ లెర్నింగ్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. చేపట్టాల్సిన చర్యలు గురించి అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు..
- సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలి.
- ఈ ట్యాబ్లు వారికి 9, 10 తరగతుల్లో కూడా ఉపయోగపడేలా ఉండాలని, అందుకోసం మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలని సూచన.
- అలాగే అన్ని తరగతి గదిలో డిజిటల్ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని ఆదేశం.
- డిజిటల్ బోర్డుల ద్వారా బోధించడం వలన సైన్స్, మాథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు ఈజీగా అర్ధమవుతాయని, టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందని సూచన.
- డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల భద్రతపై కూడా దృష్టి సారించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY