ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 7, గురువారం నాడు ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “వైఎస్ఆర్ ఆసరా” రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఒంగోలులో సీఎం పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను సోమవారం నాడు రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. సభావేదిక, హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు.
సభా ప్రాంగణంలో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ముందుగా గత ఏడాది సెప్టెంబర్ 11న రాష్ట్రంలో మహిళల సంక్షేమం, సాధికారతే ధ్యేయంగా వైఎస్ఆర్ ఆసరా పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని 87 లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ది జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ