రాజ్‌భవన్‌ చేరుకున్న ఏపీ నూతన గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌.. గన్నవరంలో సీఎం జగన్ ఘనస్వాగతం

CM YS Jagan Welcomes AP New Governor Justice Abdul Nazeer at Gannavaram Airport,CM YS Jagan Welcomes,AP New Governor,Justice Abdul Nazeer,Abdul Nazeer at Gannavaram Airport,Mango News,Mango News Telugu,Governor Of Andhra Pradesh Appointed As Governor Of Chhattisgarh,Governor Of Chhattisgarh Appointed As Governor Of Manipur,Governor Of Manipur Appointed As Governor Of Nagaland,Mango News,Mango News Telugu,Governor Of Bihar Appointed As Governor Of Meghalaya,Governor Of Himachal Pradesh Appointed As Governor Of Bihar,Governor Of Arunachal Pradesh Appointed As Lt. Governor Of Ladakh,Governor Of Jharkhand Appointed As Governor Of Maharashtra,Lt. General Kaiwalya Trivikram Parnaik (Retired),Lakshman Prasad Acharya,C P Radhakrishnan,Shiv Pratap Shukla,Gulab Chand Kataria,S. Abdul Nazeer,Justice (Retd) Biswa Bhusan Harichandan,Anusuiya Uikye,La. Ganesan,Phagu Chauhan,Rajendra Vishwanath Arlekar,Brig (Dr) B D Mishra (Retd),Ramesh Bais

ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ (రిటైర్డ్‌) సయ్యద్ అబ్దుల్‌ నజీర్‌ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. న్యూఢిల్లీ నుంచి సతీసమేతంగా వచ్చిన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు సీఎం జగన్ పుష్పగుచ్ఛం, శాలువా అందించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులతో సహా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆతిథ్య కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను సీఎం జగన్ గవర్నర్‌కు పరిచయం చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్ కే మోషేన్ రాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి, ఆర్టీఐ చీఫ్ కమిషనర్ ఆర్‌ఎం బాషా, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తదితరులు పాల్గొన్నారు.

అలాగే గవర్నర్ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మరియు సంయుక్త కార్యదర్శి పిఎస్ సూర్య ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. కాగా ఫిబ్రవరి 24న (శుక్రవారం) ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం జగన్ సహా మంత్రులు, న్యాయశాఖ, పోలీసు శాఖలతో పాటు ఇతర శాఖల పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇక అంతకుముందు బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్, సతీమణి సుప్రవ హరిచందన్‌లకు పుష్పగుచ్ఛం అందించి వీడ్కోలు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =