ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కూడా జూలై 23, గురువారం నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4482 కి చేరుకుంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో విజయవాడ నగరంలో జూలై 26 నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే లాక్డౌన్ అమలు ప్రచారంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టత ఇచ్చారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో లాక్డౌన్ విధించడం లేదని, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలు అవాస్తమని చెప్పారు. నిరాధారమైన వార్తలతో ప్రజలను అయోమయానికి, ఇబ్బందులకు గురిచేయొద్దని కలెక్టర్ కోరారు. మరోవైపు కృష్ణా జిల్లాలో నమోదైన 4482 కేసుల్లో 3260 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1098 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన జిల్లాల్లో మరణించిన వారి సంఖ్య 124 కి పెరిగింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu