నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సోమవారం ఒక ప్రకటన చేసింది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను సెప్టెంబరు 21వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయన్నారు. టిక్కెట్ల లభ్యతను బట్టి ఈ టిక్కెట్లు మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన జారీ చేయబడతాయని చెప్పారు.
ఇక నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయన్నారు. మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయబడతాయని, అయితే బ్రహ్మోత్సవం తేదీలు అనగా అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించబడవని తెలిపారు. భక్తులు ఈ విషయాలను గుర్తించి, తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY