తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1554 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 22, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 49,259 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 15,882 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. అలాగే కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 438 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 37,666 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 11,155 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 76.5 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.88 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1554):
- జీహెచ్ఎంసీ – 842
- రంగారెడ్డి – 132
- మేడ్చల్ – 96
- కరీంనగర్ – 73
- నల్లగొండ – 51
- వరంగల్ అర్బన్ – 38
- వరంగల్ రూరల్ – 36
- నిజామాబాద్ – 28
- మెదక్ – 25
- సంగారెడ్డి – 24
- పెద్దపల్లి – 23
- ఖమ్మం – 22
- కామారెడ్డి – 22
- సూర్యాపేట – 22
- వనపర్తి – 21
- రాజన్న సిరిసిల్ల – 18
- మహబూబ్నగర్ – 14
- నాగర్కర్నూల్ – 14
- మహబూబాబాద్ – 11
- యాదాద్రి భువనగిరి – 8
- ములుగు – 8
- ఆదిలాబాద్ – 8
- జోగుళాంబ గద్వాల – 5
- జగిత్యాల – 3
- మంచిర్యాల – 3
- సిద్దిపేట – 2
- ఆసిఫాబాద్ – 2
- నిర్మల్ – 1
- భద్రాద్రి కొత్తగూడెం -1
- వికారాబాద్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu